రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-09-29T17:23:54+05:30
అన్నవరం-రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య..
తుని(తూర్పు గోదావరి): అన్నవరం-రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, కాచూరు గ్రామానికి చెందిన రావాడ ఓంకార్ సోమవారం విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని ఏరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని భద్రపరిచినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ షేక్ అబ్ధుల్మారూప్ తెలిపారు.
Updated Date - 2020-09-29T17:23:54+05:30 IST