ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైండోవర్‌ కేసు కోసం చితకబాదారు

ABN, First Publish Date - 2020-03-08T09:17:02+05:30

ఎక్సైజ్‌ పోలీసులు బైండోవర్‌ కేసుకోసం తనను అన్యాయంగా కొట్టి చావబాదారంటూ ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు


ప్రత్తిపాడు, మార్చి 7: ఎక్సైజ్‌ పోలీసులు బైండోవర్‌ కేసుకోసం తనను అన్యాయంగా కొట్టి చావబాదారంటూ ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన గిడుతూరి లోవరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా డు. మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది శనివారం గ్రా మానికి విచ్చేసిన లోవరాజు తనకు జరిగిన అన్యాయంపై స్థానిక విలేకర్ల వద్ద వాపోయారు. గతంలో 10 లీటర్ల సారాతో దొరకడంతో తనను ఎక్సైజ్‌ పోలీసులు రిమాండ్‌కు పంపారని చెప్పాడు.


దానిని అలుసుగా తీసుకుని బైండోవర్‌ కేసు పెడతామంటూ ప్రత్తిపాడు ఎక్సైజ్‌ సీఐ పి.వెంకటరమణ, మరో నలుగురు సిబ్బంది గత గురువారం తనను దుర్భాషలాడి చితకబాదారని లోవరాజు ఆరోపించారు. సీఐ కొట్టిన దెబ్బలు చూపుతూ లోవరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై విచారించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై ఎక్సైజ్‌ సీఐ వెంకటరమణను వివరణ కోరగా లోవరాజును తాము కొట్టలేదని, తమనే తోసేశాడని చెప్పారు.

Updated Date - 2020-03-08T09:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising