ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హత్రాస్‌’ నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2020-10-02T08:26:00+05:30

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట్రావు


ఏలేశ్వరం, అక్టోబరు 1: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీసీసీ సభ్యుడు ఉమ్మిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. గురువారం ఏలేశ్వరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీల పర్యటనను అడ్డుకుని అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ను పోలీసులు కిందపడేసి లాఠీచార్జి చేసి అవమానించడం సమంజసం కాదని, ఈఘటనకు బాధ్యత వహించి సీఎం యోగి రాజీనామా చేయాలని, పోలీసులు క్షమాపణ చెప్పాలని వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-10-02T08:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising