ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ము ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2020-11-28T06:25:23+05:30

దమ్ము ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తూ తిరగబడి డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో గ్రామం విషాదంలో మునిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం, నవంబరు 27: దమ్ము ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తూ తిరగబడి డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో గ్రామం విషాదంలో మునిగింది. సీతానగరం మండలం చీపురుపల్లికి చెందిన మార్గాని శ్రీనుకు కొన్నేళ్ల కిందట తూర్పుగోనగూడేనికి చెందిన మేకా నారాయణమూర్తి కుమార్తెతో వివాహం జరిగింది. అనంతరం ఇల్లరికం రావడంతో అత్తారింటి వద్దే ఉంటూ గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేకపోవడంతో డ్రైవర్‌ వృత్తితోపాటు ఇంటివద్ద కూరగాయలు దుకాణం పెట్టుకున్నాడు. శ్రీనుకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు. గతేడాది డాబా పైనుంచి అదుపుతప్పి కింద పడిపోవడంతో కుమార్తెకు కంటి చూపు మందగించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-28T06:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising