వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తే గుణపాఠం
ABN, First Publish Date - 2020-08-12T11:11:01+05:30
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతామని మాలమహానాడు హెచ్చరించింది.
ఉప్పలగుప్తం, ఆగస్టు 11: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతామని మాలమహానాడు హెచ్చరించింది. ఎన్.కొత్తపల్లిలో కొంకి వెంకటబాబ్జి అధ్యక్షతన మంగళవారం మాల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. మాల మహానాడు ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పెయ్యల శ్రీనివాసరావు, ఐ.ఎన్.మల్లేశ్వరరావు, పెయ్యల పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-12T11:11:01+05:30 IST