ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 18న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటరు జాబితా ప్రచురణ

ABN, First Publish Date - 2020-12-27T07:35:48+05:30

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితాను వచ్చే నెల 18న ప్రచురిస్తామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ,డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితాను వచ్చే నెల 18న ప్రచురిస్తామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఇప్పటివరకు దీనికి సంబంధించి చేపట్టిన కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 1న ముసాయిదా జాబితా ప్రచురించామన్నారు. క్లైయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖారు వరకు గడువు ఇచ్చామన్నారు. వచ్చే నెల 12న వీటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అదేరోజున అను బంధాలను తయారు చేసి ముద్రిస్తామన్నారు. జాబితాలో లేని అర్హులైన ఉపాధ్యాయులు, లెక్చరర్‌లు ఈ నెల 31లోగా అన్ని తహసీల్దార్‌/ఎంపీడీవో/ మునిసిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం కోసం టోల్‌ ప్రీ నంబరు 1950లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-12-27T07:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising