దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగదు..తహశీల్దార్ వజ్రపు జితేంద్ర
ABN, First Publish Date - 2020-09-24T08:11:14+05:30
సచివాలయాల్లో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై ఫిర్యాదులొస్తే సదరు సి బ్బందిపై చర్యలు తప్పవని తహశీల్దార్ వజ్రపు జితేంద్ర
సామర్లకోట, సెప్టెంబరు 23: సచివాలయాల్లో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై ఫిర్యాదులొస్తే సదరు సి బ్బందిపై చర్యలు తప్పవని తహశీల్దార్ వజ్రపు జితేంద్ర హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు అధ్యక్షతన సామర్లకోట మండల, పట్టణ పరిధి సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ సహాయకులకు మెప్మా భవనంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి దరఖాస్తుదారుడికి పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. అనంతరం మండల వ్యవసాయాధికారి సత్య, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, సర్వేయర్ అప్పారావు, ఎంఎ్సవో బాషా తదితరులు వివిధ అంశాలపై వివరించారు.
Updated Date - 2020-09-24T08:11:14+05:30 IST