భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-11-28T06:24:18+05:30
భార్య కాపురానికి రావడంలేదని మనస్తా పం చెందిన ఓ యువకుడు శుక్రవా రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెం దాడు.
పెద్దాపురం, నవంబరు 27: భార్య కాపురానికి రావడంలేదని మనస్తా పం చెందిన ఓ యువకుడు శుక్రవా రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెం దాడు. ఎస్ఐ ఏ.బాలాజీ వివరాల ప్రకారం.. పెద్దాపురం పట్టణంలోని వరహాలయ్యపేటకు చెందిన కాకర్లపూడి శివశంకరరాజు(28) తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు. తన భార్య రెండునెలలు గా పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదని మ నస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ చెప్పారు. అతడు స్థానికంగా ఓ రొయ్యలపరిశ్రమలో పనిచేస్తున్నాడని, ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Updated Date - 2020-11-28T06:24:18+05:30 IST