ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలేరు కాలువలో విద్యార్థి గల్లంతు

ABN, First Publish Date - 2020-10-01T08:13:35+05:30

ఏలేరు రిజర్వాయర్‌ ప్రధాన కాలువలో పడి దాకమూరి మహేష్‌(20) అనే యువకుడు బుధవారం గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలేశ్వరం, సెప్టెంబరు 30: ఏలేరు రిజర్వాయర్‌ ప్రధాన కాలువలో పడి దాకమూరి మహేష్‌(20) అనే యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. పట్ణణ పరిధిలోని సాయినగర్‌కాలనీకు చెందిన దాకమూరి చక్రధర్‌, లక్ష్మి దంపతుల కుమారుడైన మహేష్‌ ప్రైవేట్‌ కళాశాలలో బీఫార్మసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తన స్నేహితుడు చిన్నాతో కలసి మహేష్‌ పట్టణ శివారు సాయిబాబామెట్టకు సమీపంలోని ఏలేరు కాలువ వద్దకు బహిర్భూమి నిమిత్తం వెళ్లాడు.


నది ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఎస్‌ఐ శంకరరావు తదితరులు ఈతగాళ్ల సహాయంతో మహేష్‌ కోసం నది వెంబడి గాలించారు. వరదనీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనపై మహేష్‌ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.  


Updated Date - 2020-10-01T08:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising