కరోనా బాధితుల సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్
ABN, First Publish Date - 2020-07-18T15:53:11+05:30
తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ బాధితుల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీ మురళీధర్రెడ్డి తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లైన బొమ్మూరు, బోడసకుర్రు,
కొవిడ్ బాధితుల సందేహాల నివృత్తికి కాల్ సెంటర్
హెల్ప్లైన్కు ఫోన్ చేయండి : కలెక్టర్
కాకినాడ (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ బాధితుల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీ మురళీధర్రెడ్డి తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లైన బొమ్మూరు, బోడసకుర్రు, అలాగే రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రి, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, అమలాపురం కిమ్స్ ఆసుపత్రులతోపాటు హోంక్వారంటైన్లో ఉన్న కొవిడ్ బాధితులకు ఏదైనా సమస్య, సందేహాలుంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లా హెల్ప్లైన్ నంబర్లు 91542 02080, 91542 02255, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 0866- 2410978లలో సంప్రదించాలన్నారు. అదేవిధంగా ఈ ఫోన్ నంబర్లకు మెసేజ్, వాట్సప్ కూడా చేయవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-07-18T15:53:11+05:30 IST