‘ఆరు కిలోమీటర్ల దూరంలో పట్టాలిస్తారా?’
ABN, First Publish Date - 2020-06-02T09:21:32+05:30
అందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రామానికి దగ్గరలో ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గొల్లప్రోలు
గొల్లప్రోలు రూరల్, జూన్ 1: అందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రామానికి దగ్గరలో ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన లబ్ధిదారులు, ప్రజలు సోమవారం తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబ్రోలు సమీపంలో అడవిపుంతలో భూములను రెవెన్యూ అధికారులు తీసుకుంటున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇదే జరిగితే తామంతా ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని, సదరు స్థలాలు తమకు అనుకూలంగా ఉండవని చెప్పారు.
Updated Date - 2020-06-02T09:21:32+05:30 IST