ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
ABN, First Publish Date - 2020-12-03T05:52:53+05:30
మండపేట పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. పట్టణ ఎస్ఐ రాజేష్కకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
మండపేట, డిసెంబరు 2: మండపేట పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. పట్టణ ఎస్ఐ రాజేష్కకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట మండలం ద్వారపూడికి చెందిన పట్నాల వీరవెంకటసత్యనారాయణ తన భార్య అచ్యుతవర్ధినితో కలిసి రామచంద్రపురం వెళుతుండగా మండపేట పెద్ద కాల్వ వద్దకు వచ్చేసరికి రావులపాలెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో సత్యనారాయణ ఒకవైపు పడిపోగా, భార్య అచ్యుతవర్ధిని బస్సు వెనుక టైరు కింద పడిపోవడంతో మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్కుమార్ తెలిపారు.
Updated Date - 2020-12-03T05:52:53+05:30 IST