మైనర్ విద్యార్థుల వివాహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: రాజ్యలక్ష్మి
ABN, First Publish Date - 2020-12-04T20:01:22+05:30
ఇంటర్ విద్యార్థులు కళాశాలలో వివాహం చేసుకున్న ఘటనపై మహిళ కమిషన్ సభ్యురాలు డా.రాజ్యలక్ష్మి స్పందించారు.
రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులు కళాశాలలో వివాహం చేసుకున్న ఘటనపై మహిళ కమిషన్ సభ్యురాలు డా.రాజ్యలక్ష్మి స్పందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైనర్ విద్యార్థుల వివాహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. యువత పెడదోవ పట్టింది అనడానికి ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు. పెళ్లిని, చదువుని అలుసుగా తీసుకుంటున్నారని...పెళ్లి అనేది ఒక బొమ్మలాట అయిపోయిందని మండిపడ్డారు. యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా కమిషన్ తరపున అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కాలేజ్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయటంతో పాటు కంప్లెయింట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా కమిషన్ తరపున ఈ ఘటనపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని రాజ్యలక్ష్మి తెలిపారు.
Updated Date - 2020-12-04T20:01:22+05:30 IST