అమ్మవార్లకు బంగారు కాసులహారాల బహూకరణ
ABN, First Publish Date - 2020-10-01T07:25:55+05:30
అమ్మవార్లకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మాధవరపు కుటుంబసభ్యులు బంగారు కాసుల హారాలు బహుకరించారు.
గొల్లప్రోలు రూరల్, సెప్టెంబరు 30: అమ్మవార్లకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మాధవరపు కుటుంబసభ్యులు బంగారు కాసుల హారాలు బహుకరించారు. గ్రామానికి చెందిన మాధవరపు నాగబాబు గతేడాది మరణించగా కొంతకాలానికి అతని బార్య, కుమార్తెలు మరణించారు.
మరణించకముందు వారి కోరిక మేరకు కుటుంబసభ్యులు, బంధువులు కలిసి రూ.ఆరు లక్షల విలువైన 12కాసుల6గ్రాముల బంగారంతో రెండు కాసులహారం తయారు చేయించారు. వాటిలో ఒక దానికి చేబ్రోలు సత్తెమ్మతల్లి ఆలయానికి బుధవారం అందజేశారు. మరో హారాన్ని విజయవాడ కనకదుర్గమ్మవారికి అలంకరించేందుకుగాను ఈవో సురేష్బాబుకు అందజేశారు.
Updated Date - 2020-10-01T07:25:55+05:30 IST