ప్రబంధ పోర్టల్లో నమోదు చేయాలి
ABN, First Publish Date - 2020-11-03T06:16:55+05:30
సర్వశిక్షా సొసైటీ (ఎస్ఎస్ఎస్) ద్వారా విద్యా కార్యక్రమాలకు చేసే ఖర్చు ప్రతీ పైసా ప్రతీ నెలా 1నుంచి 5 లోగా ప్రబంధ పోర్టల్లో నమోదు చేయాలని ఎస్ఎస్ఎస్ ఏపీసీ విజయభాస్కర్ ఆదేశించారు.
- ఎస్ఎస్ఎస్ ఏపీసీ విజయభాస్కర్
కాకినాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సర్వశిక్షా సొసైటీ (ఎస్ఎస్ఎస్) ద్వారా విద్యా కార్యక్రమాలకు చేసే ఖర్చు ప్రతీ పైసా ప్రతీ నెలా 1నుంచి 5 లోగా ప్రబంధ పోర్టల్లో నమోదు చేయాలని ఎస్ఎస్ఎస్ ఏపీసీ విజయభాస్కర్ ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్ ఏఏ పాఠశాలలకు ఎంత పంపిణీ చేస్తున్నాం, అక్కడ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేసేలా సొసైటీ సెక్టోరల్ అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. ఈ మేరకు సోమవారం ఏపీసీ కార్యాలయంలో ఆయన సంబంధిత సిబ్బందితో పోర్టల్ను వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు.
Updated Date - 2020-11-03T06:16:55+05:30 IST