పీఎం కళ్యాణ్ యోజనకు శ్రీకారం
ABN, First Publish Date - 2020-04-03T12:03:35+05:30
కొవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున పేద కుటుంబాల మహిళలకు కాస్త ..
జన్ధన్ మహిళా ఖాతాదారులకు రూ. 500 చొప్పున మూడు నెలలు నగదు జమ
6.18 లక్షల మందికి జిల్లాలో లబ్ధి : ఎల్డీఎం షణ్ముఖం
కాకినాడ, మార్చి2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున పేద కుటుంబాల మహిళలకు కాస్త ఆర్థిక ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన అమలు చేస్తోందని లీడ్ బ్యాంక్ మేనేజర్ షణ్ముఖం తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 6.18 లక్షల మంది మహిళలకు పీఎం జన్ధన్ ఖాతాలు ఉన్నాయన్నారు.
వీరందరికీ ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలపాటు వారి ఖాతాలకు రూ.500 నగదు జమ అవుతుందన్నారు. అయితే లబ్ధిదారులందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు. ఖాతాదారుల ఖాతా సంఖ్య చివర 0, 1 నుంచి నగదు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు.
Updated Date - 2020-04-03T12:03:35+05:30 IST