ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం

ABN, First Publish Date - 2020-08-04T11:35:38+05:30

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రం సర్వ నాశనం అవడానికి కారకులయ్యారని మాజీ ఉప ముఖ్య మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 


సామర్లకోట, ఆగస్టు 3: ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రం సర్వ నాశనం అవడానికి కారకులయ్యారని మాజీ ఉప ముఖ్య మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అ న్నారు. అచ్చంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసు కుంటారో తెలియదని అన్నారు. స్వప్రయోజనాల కోసం రా ష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు.  3 రాజధానుల నిర్ణయం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి విఘాతమన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. 


 ప్రైవేటు  వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యంగా మారిందన్నారు. కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తిని హోం క్వారంటైన్‌ చేసి మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడం లేదన్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి సరైన దహన సంస్కారాలకు నోచుకోవడం లేదన్నారు. ఆస్పత్రి మార్చురీలో శవాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు శ్యానిటైజర్‌ తాగి చనిపోతున్నారన్నారు. చీప్‌ లిక్కర్‌ను శానిటైజ్‌ సీసాలో నింపి అమ్మడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 

Updated Date - 2020-08-04T11:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising