పెదపట్నంలంకలో గ్రామస్థుల ధర్నా
ABN, First Publish Date - 2020-06-04T10:58:50+05:30
రోనా పాజిటివ్ వచ్చిన పెదపట్నంలంకకు చెందిన పదమూడేళ్ల బాలికకు హోం క్వారంటైన్కు తరలిస్తున్నారనే ..
మామిడికుదురు, జూన్ 3: కరోనా పాజిటివ్ వచ్చిన పెదపట్నంలంకకు చెందిన పదమూడేళ్ల బాలికకు హోం క్వారంటైన్కు తరలిస్తున్నారనే సమాచారంతో గ్రామస్థులు బుధవారం పాశర్లపూడిలో ధర్నా నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పెదపట్నంలంకకు చెందిన ఓ కుటుంబాన్ని రావులపాలెం క్వారంటైన్కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ కుటుంబంలో బాలికకు పాజిటివ్ రావడంతో ఇంటికి తరలిస్తున్నారన్న సమాచారంతో పాశర్లపూడిలో సెంటర్లో గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. బాలికను అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తామని అధికారులు తెలియజేయడంతో ధర్నా విరమించారు.
Updated Date - 2020-06-04T10:58:50+05:30 IST