ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్‌ జైల్‌ బంక్‌ వద్ద..సురుచి ఫుడ్స్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-02-20T09:22:07+05:30

ప్రపంచ అతిపెద్ద లడ్డు సృష్టికర్తగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన తాపేశ్వరం కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్‌ రాజమహేంద్రవరం బ్రాంచ్‌ స్థానిక సెంట్రల్‌ జైల్‌ పెట్రోల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి సిటీ, పిబ్రవరి 19: ప్రపంచ అతిపెద్ద లడ్డు సృష్టికర్తగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన తాపేశ్వరం కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్‌ రాజమహేంద్రవరం బ్రాంచ్‌ స్థానిక సెంట్రల్‌ జైల్‌ పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. రాజమహేం ద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. సంస్థ అధినేత మల్లిబాబు వారికి స్వాగతం పలికారు. ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలతో, నాణ్యతే సంప్రదాయంగా సాగుతున్న తమ సంస్థను 80 ఏళ్ల క్రితం తాపేశ్వరంలో పోలిశెట్టి సత్తిరాజు ప్రారంభించారన్నారు. ఐఎస్‌వో 9001- 2015, ఐఎస్‌వో 22000 సర్టిఫికెట్లతోపాటు గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించామ న్నారు. ఇప్పటివరకు కాకినాడలో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయని, నగరంలో తొలిసారిగా తమ శాఖను ప్రారంభించడం ఆనందదాయకం అన్నారు. 250 రకాల స్వీట్స్‌, 40రకాల హాట్లు మాతృ సంస్థ తాపేశ్వరం నుంచే సరఫరా అవుతాయన్నారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising