పీజీ వైద్య విద్యార్థులకు పెరిగిన స్టైఫండ్
ABN, First Publish Date - 2020-08-13T11:25:57+05:30
పీజీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీజీహెచ్(కాకినాడ) ఆగస్టు 12: పీజీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేస్తున్న వారికి ఇస్తున్న రూ.15,817లను రూ. 19,589కి పెంచారు. పీజీ మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏటా రూ.46,524, మూడో ఏడాది రూ.48,973కు పెంచారు. పీజీ డిప్లొమా వారికి ఏడాది రూ.44,075, రెండో ఏట రూ.46,524కు పెంచారు. సూపర్ స్పెషాలిటీ పీజీలకు మొదటి ఏడాది రూ.48,973, రెండో ఏట రూ.51,422, మూడో ఏడాది రూ. 53,869కు పెంచారు. ఎండీఎస్ కోర్సు చేస్తున్న వారికి కూడా ఇలాగే పెరిగాయి.
Updated Date - 2020-08-13T11:25:57+05:30 IST