వాకింగ్కు వెళ్తే ఇల్లు దోపిడీ
ABN, First Publish Date - 2020-09-29T17:44:19+05:30
నగరంలోని సీతంపేటలో పట్టపగలే ఒక గంట వ్యవధిలో గుర్తుతెలియని..
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని సీతంపేటలో పట్టపగలే ఒక గంట వ్యవధిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటిని దోచేశారు. దీనికి సంబంధించి త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... జి.రాజేంద్ర ప్రసాద్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. గంటలో తిరిగి ఇంటి వచ్చి చూస్తే తాళాలు పగులగొట్టి వున్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో 10 కాసుల బంగారు వస్తువులు, 300 గ్రాముల వెండి వస్తువులు, రూ. 20వేలు నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-09-29T17:44:19+05:30 IST