హాస్టళ్లకు నిరాశ్రయుల తరలింపు
ABN, First Publish Date - 2020-03-30T09:03:44+05:30
రాజమహేంద్రవరం పు ష్కరఘాట్, మెయిన్రోడ్డు, ఆనం కళాకేంద్రం తదితర ప్రాంతాల్లో తిరిగే
రాజమహేంద్రవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం పు ష్కరఘాట్, మెయిన్రోడ్డు, ఆనం కళాకేంద్రం తదితర ప్రాంతాల్లో తిరిగే సుమారు 200 మంది నిరాశ్రయులను అధికారులు హాస్టళ్లకు తరలించారు. వీరంత చాలాకాలంగా రాజమహేంద్రవరం గోదావరి తీరంలోనే జీవిస్తున్నారు. అందులో కొందరు భిక్షమెత్తుకుంటారు. కొందరు వివిధ పనులు చేసుకుంటారు. వీరు ఫుట్పాత్లు, గోదావరి ఘాట్ల్లో వి శ్రాంతి తీసుకుంటారు. కరోనా ప్రభావంతో వీరందరినీ ఆదివారంరాత్రి నాలుగు బస్సుల్లో ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఉమెన్స్ హాస్టల్కు 91 మందిని, మిగతావారిని వై.జంక్షన్లోని బీసీ బాలుర హాస్టల్కు తరలించారు. కరోనా ప్రభావం తగ్గే వరకూ ఈ హాస్టల్స్లోనే ఉంచుతారు.
Updated Date - 2020-03-30T09:03:44+05:30 IST