నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ABN, First Publish Date - 2020-11-27T05:58:53+05:30
ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పరారైన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన టీడీపీ బృందం
జీజీహెచ్ (కాకినాడ), నవంబరు 26: ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పరారైన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జగన్నాథపురంలోని గోళీల పేటలో అత్యాచారానికి గురై జీజీహెచ్లోని గైనిక్ విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారిని గురువారం రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దిశ వంటి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా, ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు. అనిత వెంట మేయర్ సుంకర పావని, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, చాపల లీలా ప్రశాంతి, సుంకర తిరుమలకుమార్ ఉన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీ కరణం కుమార్కు వినతి పత్రం అందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
బాలికకు శస్త్రచికిత్స
బాలికకు జీజీహెచ్లో గైనిక్ విభాగ వైద్యులు కొలస్టమీ శస్త్రచికిత్స చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు తెలిపారు. బాలిక ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉందని, 3 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందిస్తామన్నారు.
Updated Date - 2020-11-27T05:58:53+05:30 IST