అలనాటి రాజమహేంద్రి ప్రముఖులపై పుస్తకం
ABN, First Publish Date - 2020-10-19T05:47:55+05:30
రాజమహేంద్రిలో అలనాటి 150మంది ప్రముఖుల జీవిత వివరాలు తెలియజేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ ఆవిష్కరించారు.
గోదావ రి సిటీ, అక్టోబరు 18: రాజమహేంద్రిలో అలనాటి 150మంది ప్రముఖుల జీవిత వివరాలు తెలియజేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు సేకరిం చి రచించిన ఈపుస్తకం ఆయన జన్మదినం సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కందుకూరి వంటి 150మంది మహానుభావుల వివరాలు, రాజమహేంద్రవరంలో వారు ఎక్కడ జీవించినది ఈ పుస్తకంలో ఉంటుందన్నారు. భావితరాలు ఈపుస్తకంతో స్ఫూర్తిని పొందుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిరియం బాబురావు, సమితి కార్యదర్శి పెదిరెడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పి.ఎస్.రవీంద్ర, సన్నిధానంశాసి్త్ర పాల్గొన్నారు.
Updated Date - 2020-10-19T05:47:55+05:30 IST