నిజాయితీని నిరూపించుకున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లు
ABN, First Publish Date - 2020-12-15T06:41:38+05:30
బస్సులో ఒక ప్రయాణికుడు విడిచివెళ్లిన బ్యాగ్ను తిరిగి ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు తన నిజాయితీని నిరూపించుకున్నారు.
రాజోలు, డిసెంబరు 14: బస్సులో ఒక ప్రయాణికుడు విడిచివెళ్లిన బ్యాగ్ను తిరిగి ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు తన నిజాయితీని నిరూపించుకున్నారు. రాజోలు డిపోకు చెందిన సూపర్లగ్జరీ బస్సు ఈనెల13న హైదరాబాద్ జీడిమెట్లలో బయలుదేరి రాజోలు వస్తుంది. గుంటూరుకు చెందిన ఆర్.వెం కటకృష్ణ విజయవాడ వరకు ప్రయాణించాడు. వెంకటకృష్ణ విజయవాడలో దిగి తన బ్యాగును మరిచిపోయాడు. రూ.4లక్షల విలువైన బంగారు ఆభరణాలు, దుస్తులు ఉన్నాయి. వెంకటకృష్ణ సోమవారం రాజోలు డిపోకు వచ్చి డిపో మేనేజర్ మనోహర్కు తగిన ఆధారాలు చూపించగా బ్యాగు, బంగారు వస్తువులు ఇచ్చారు. నిజాయితీగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్లు జీవీఎస్.నారాయణ. బి.కృష్ణలను పలువురు అభినందించారు. డీఎం మనోహర్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు డ్రైవర్లను అభినందించారు.
Updated Date - 2020-12-15T06:41:38+05:30 IST