ముగిసిన పోషకాహార మాసోత్సవాలు
ABN, First Publish Date - 2020-10-01T07:59:41+05:30
కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలో నెలరోజులుగా జరుగుతున్న జాతీయ పోషకాహార మాసోత్సవాలు బుధవారం ముగిశాయి. సంపూర్ణ
రాజానగరం, సెప్టెంబరు 30: కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలో నెలరోజులుగా జరుగుతున్న జాతీయ పోషకాహార మాసోత్సవాలు బుధవారం ముగిశాయి. సంపూర్ణ పోషకాహారంపై గర్భిణి, బాలింతలు, చిన్న పిల్లల సంరక్షణపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలతో పాటు పెరటి తోటల పెంపకం శిక్షణా కార్యక్రమాలు, విత్తనాలు సరఫరా చేశామని కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాయుడు పేర్కొన్నారు.
ఆహారంలో ఉండాల్సిన పోషకాలు, వాటి ఆవశ్యకత, ఆరోగ్య పరిరక్షణలో పోషకాహార ప్రాధాన్యతను గృహ విజ్ఞాన అధికారి సీహెచ్ సింధు వివరించారు. పోషణ అభియాన్ భాగం గా కూరగాయల విత్తనాలు, నారు, మునగ మొక్కలు, శెనగలను గ్రామీణ మహిళలు, అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సి ఆహారం, జాగ్రత్తలపై వాట్సాప్ మెసేజ్లా ద్వారా తెలియజేశారు.
Updated Date - 2020-10-01T07:59:41+05:30 IST