పలువురు డీఎస్పీలకు స్థానచలనం
ABN, First Publish Date - 2020-11-28T06:26:39+05:30
జిల్లాలో పలు ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతితోపాటు స్థానచలనం, పోస్టింగ్లు కల్పిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాకినాడ క్రైం, నవంబరు 27: జిల్లాలో పలు ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతితోపాటు స్థానచలనం, పోస్టింగ్లు కల్పిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రరం అర్బన్ డీఎస్పీగా పనిచేస్తున్న డి.శ్రీనివాసరెడ్డిని అర్బన్లో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)-2 డీఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ డీటీసీలో సీఐగా కొనసాగుతోన్న బి.అప్పారావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించి జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్-1కు స్థాన చలనం కల్పించారు. కాకినాడ ట్రాఫిక్ సీఐగా పని చేస్తున్న పడాల మురళీకృష్ణారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి జిల్లా ట్రాఫిక్ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)లో డీఎస్పీగా కొనసాగుతోన్న ఎం.అంబికాప్రసాద్కు రెగ్యులర్ డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులు చేశారు.
Updated Date - 2020-11-28T06:26:39+05:30 IST