24 గంటల్లో 354 కేసులు
ABN, First Publish Date - 2020-11-03T07:11:44+05:30
జిల్లాలో గడిచిన 24 గంటల్లో ట్రూనాట్ ద్వారా చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 271, ర్యాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 83... మొత్తం 354 మందికి వైరస్ సోకింది.
8 1,16,389కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య 8 ఒకరి మృతితో 613 కరోనా మరణాలు
కాకినాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గడిచిన 24 గంటల్లో ట్రూనాట్ ద్వారా చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 271, ర్యాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 83... మొత్తం 354 మందికి వైరస్ సోకింది. దీంతో జిల్లావ్యాప్తంగా పాజిటివ్ బారిన పడిన వారి సంఖ్య 1,16,389కి చేరింది. తాజాగా ఒకరు మృతి చెందడంతో 613 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 4207 మంది వైరస్తో యాక్టివ్ దశలో ఉన్నారు. 1,11,569 మంది చికిత్స పొందుతూ కోలుకున్నారు.
Updated Date - 2020-11-03T07:11:44+05:30 IST