ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానంతో.. ఇంటినుంచి బయటకు వెళ్లి..

ABN, First Publish Date - 2020-08-03T18:03:48+05:30

కరోనా భయంతో ఓ వృద్ధుడు కాల్వలో దూకేశాడు. ఇటీవల మండపేటలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా భయంతో.. కాల్వలో దూకేశాడు..!

వైద్యపరీక్షలు చేయించుకోకుండానే అనుమానంతో ఆత్మహత్యాయత్నం

మండపేట మండలం వెలగతోడులో ఘటన.. గాలిస్తున్న పోలీసులు


మండపేట(తూర్పు గోదావరి): కరోనా భయంతో ఓ వృద్ధుడు కాల్వలో దూకేశాడు. ఇటీవల మండపేటలో ఒక వ్యాపారి ఇలా ఆత్మహత్యకు పాల్పడగా మళ్లీ అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మండపేట రూరల్ ఇన్‌చార్జి సీఐ అడపా నాగమురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట మండలం వెలగతోడుకు చెందిన రైతు చుండ్రు నరసింహారావు(60) మూడురోజులనుంచి జ్యరంతో బాధపడుతున్నాడు. ఆయన కుమారుడు ఫణి మండపేటలో, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. వెలగతోడులో భార్యతో కలిసి ఆయన ఉంటున్నాడు.


జ్వరానికి గురైన తండ్రికి ఆదివారం మండపేటలో వైద్యపరీక్షలు చేయిస్తానని కుమారుడు తెలిపాడు. ఇంతలోనే ఆయనకి కరోనా అనుమానం వచ్చి శనివారం రాత్రి సమయంలో ఇంటినుంచి వెళ్లాడు. వెలగతోడు-మెర్నిపాడు మధ్య ఉన్న పంటకాల్వలో దూకేశాడు. పరీక్షలు కూడా చేయించుకోకముందే ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి సీఐ మురళి నేతృత్వంలో కాల్వలో గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-08-03T18:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising