బ్యాంకుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు నిల్
ABN, First Publish Date - 2020-08-15T11:20:23+05:30
బ్యాంకుల వద్ద కరోనా నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని యూనియన్ బ్యాం
ప్రజాసంఘాల నాయకుల ఆగ్రహం
పిఠాపురం, ఆగస్టు 14: బ్యాంకుల వద్ద కరోనా నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని యూనియన్ బ్యాంకు సహా పలు బ్యాంకుల వద్ద ఖాతాదారులు నిబంధనలు పాటించకుండా గుమిగూడి ఉండడం, లోపలికి వెళ్లేందుకు ఒకరినొకరు తోసుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నా బ్యాంకుల అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు.
దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడినా కనీస స్పందన లేదని నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పట్టణ ఎస్ఐని కలిసి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని నాయకులు ఎస్.రామకృష్ణ, కోనేటి రాజు, ఈగల త్రిమూర్తులు, కరుణరాజ్ తదితరులు తెలిపారు.
Updated Date - 2020-08-15T11:20:23+05:30 IST