ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట కాలువ ఆక్రమణపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-05-29T11:46:19+05:30

నడకుదురులో పంట కాలువ ఆక్రమణపై పలువురు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, మే 28: నడకుదురులో పంట కాలువ ఆక్రమణపై పలువురు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నడిమిలంక పంటకాలువ గట్టును ఆక్రమించి పలువురు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రైతులు తమ పొలాల్లోకి రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.  చేసేదిలేక కొందరు రైతులు కాలువకు అవతలి గట్టును మిషన్‌తో చదునుచేసి రాకపోకలకు అనువుగా మార్చుకున్నారు. అయితే ఈ క్రమంలో కాలువను కొంతమేర పూడ్చివేయడంపై ఓ వర్గం రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకంలో చేసిన పని వృథా అయినట్టేనని ఆందోళన వ్యక్తంచేశారు. వీఆర్‌వో ఆదినారాయణ పంటకాలువను పరిశీలించారు. గట్టును సరిచేసే క్రమంలో కాలువలో పడిన మట్టిని అంతా తొలగించి సమస్య లేకుండా చేస్తామని మరో వర్గం రైతులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే గట్టుపై ఆక్రమణలను సర్వేచేసి తొలగించాలని రైతులు కోరారు. 

Updated Date - 2020-05-29T11:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising