31 వరకు జిల్లాలో లాక్డౌన్ విధింపు..కలెక్టర్ మురళీధర్రెడ్డి
ABN, First Publish Date - 2020-05-20T10:14:21+05:30
కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకు జిల్లాలో లాక్డౌన్ విధించామని కలెక్టర్
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), మే19: కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకు జిల్లాలో లాక్డౌన్ విధించామని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అదే విధంగా ద్విచక్ర వాహనాలపై ఒకరు, నాలుగు చక్రాల వాహనాలలో డ్రైవర్తో కలిపి ముగ్గురు మాత్రమే ప్రయాణించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతులు ఇస్తామన్నారు. ప్రజలు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వీధుల్లో రాకపోకలు సాగించాలన్నారు. అత్యవసర వైద్య పరిస్థితులుంటే వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు.
Updated Date - 2020-05-20T10:14:21+05:30 IST