ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహశీల్దార్‌పై కలెక్టర్‌ ఆగ్రహం!

ABN, First Publish Date - 2020-10-19T06:03:33+05:30

కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ అర్బన తహశీల్దార్‌ సతీష్‌ పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో నీట మునిగిన లోతట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ అర్బన తహశీల్దార్‌ సతీష్‌ పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు భోజన ఏర్పాట్లలో ఆయన విఫలమవ్వడంతో కలెక్టర్‌ ఆగ్రహానికి గురయ్యారని తెలిసింది. నాలుగు రోజు ల నుంచి ముంపునీటిలో తాము పడుతున్న అవస్థలను బాధితులు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వివరించగా ఆయన విషయాన్ని కలెక్టర్‌కు చెప్పారు. పాతబస్టాండ్‌, ట్రెజరీకాలనీ, ప్రతా్‌పనగర్‌, పప్పులమిల్లు, దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వీరికి భోజన ఏర్పాట్లు చూస్తానన్న తహశీల్దార్‌ చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే ముంపు బాధితులకు భోజనాలు సమకూర్చడానికి నగరంలో ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ నాలుగు రోజులుగా ఎందుకు భోజనాలు పెట్టలేదనేది తెలియాల్సి ఉంది. అలాగే పలువురు రేషన డీలర్ల వద్ద బియ్యం కూడా సేకరించారని విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2020-10-19T06:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising