ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి: మల్లాడి

ABN, First Publish Date - 2020-12-07T06:31:47+05:30

ప్రముఖ కవయిత్రి, విశ్రాంతి అధ్యాపకురాలు కామవరపు విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, డిసెంబరు 6: ప్రముఖ కవయిత్రి, విశ్రాంతి అధ్యాపకురాలు కామవరపు విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. రోడ్డు ప్రమాదంలో కామవరపు విజయలక్ష్మి, భర్త, చిన్న కుమారుడు మృతి చెందడంతో ఆదివారం స్థానిక సర్యశిక్షాఅభియాన్‌ సమావేశ మందిరంలో సంస్మరణ సభ నిర్వహించారు. వారి చిత్ర పటాలకు మంత్రి మల్లాడి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మల్లాడి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఎంతో ప్రతిభ ఉన్న వారి మరణం చాలా విచారకరమన్నారు. విజయలక్ష్మి లేకుండా ప్రజా ఉత్సవాలు ఇప్పటివరకు జరగలేదని, ఆమె లేనిలోటు తీరనిదని అన్నారు. విజయలక్ష్మి దంపతుల పెళ్లిరోజున ప్రతీ ఏటా ఒక కార్యక్రమం నిర్వహి స్తానని, దీనికి కుటుంబ సభ్యులు అభిప్రాయం తెలపాలన్నారు. ఈసందర్భంగా ఆర్‌ఏ శివరాజ్‌మీనా, విద్యాశాఖాధికారి కాలే సాయినాథ్‌, పంపన ప్రవీణ్‌, కవి దాట్ల దేవదానంరాజు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, బ్రాహ్మ ణసేవా సంఘం సభ్యులు మాట్లాడారు. ఎంతో మంది పేదపిల్లలకు చదువు చెప్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిం చారని వారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు. సంస్మరణ సభ నిర్వహించడంపై విజయలక్ష్మి ప్రథమ కుమారుడు ప్రశాంత్‌ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2020-12-07T06:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising