ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-07-13T17:18:57+05:30

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట(తూర్పు గోదావరి): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. అచ్చంపేటలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో సామాన్య ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల పాలనలో 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, 11 మందిని హత మార్చారన్నారు. వైసీపీ నేతల వేధింపులను తట్టుకోలేక 7 గురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో మహి ళలకు భద్రత లేకుండా పోయిందని మహిళలు చిన్నారులపై సుమారు 210 అత్యాచారాలు జరిగాయన్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని, తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దుకోవాలని తప్పుడు కేసులు బనాయించడం సరికాదని  చినరాజప్ప అన్నారు. 


Updated Date - 2020-07-13T17:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising