సమ్మె విజయవంతానికి బైక్ ర్యాలీ
ABN, First Publish Date - 2020-11-25T05:38:42+05:30
మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
భానుగుడి(కాకినాడ) నవంబరు, 24: మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికులను, ఉద్యోగులను, బానిసలుగా మార్చేందుకు ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతుల నడ్డివిరిచే వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.
Updated Date - 2020-11-25T05:38:42+05:30 IST