బీఎస్పీ జిల్లా అధ్యక్షుడి మృతి
ABN, First Publish Date - 2020-09-29T17:19:02+05:30
బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు సబ్బతి కృష్ణప్రసాద్(49) అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆకస్మికంగా..
అమలాపురం: బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు సబ్బతి కృష్ణప్రసాద్(49) అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. బీఎస్పీలో జిల్లా, రాష్ట్రస్థాయి పదవులను చేపట్టి పార్టీ అభివృద్ధి కోసం, బహుజనుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఆయన కృషి చేశారు. 1994లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం పిలుపును అందుకుని ఆ పార్టీలో సోదరుడు సబ్బతి జాన్మాస్టర్ సహకారంతో చేరారు. కృష్ణప్రసాద్ రెండు రోజుల క్రితం కొవిడ్ ఆస్పత్రిలో చేరారు.
Updated Date - 2020-09-29T17:19:02+05:30 IST