ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలహీనవర్గాలను అణచివేయడమే వైసీపీ అజెండా

ABN, First Publish Date - 2020-11-28T06:24:51+05:30

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఎదగనీయకుండా అణచి ఉంచడమే వైసీపీ అంతర్గత అజెండా అని అమలాపురం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి

కొత్తపేట, నవంబరు 27: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఎదగనీయకుండా అణచి ఉంచడమే వైసీపీ అంతర్గత అజెండా అని అమలాపురం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె కొత్తపేటలో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులే ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను, ఎంతో సౌమ్యుడిగా పేరున్న నిమ్మకాయల చినరాజప్పలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం దారుణమన్నారు. బోస్‌లాంటివారికే ఇలాంటి పరిస్థితి ఉంటే అటువంటివారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తమలాంటివారి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రశేఖరరెడ్డి చేసిన తప్పు తెలుసుకుని బోస్‌, రాజప్పలకు క్షమాపణ చెప్పాలని, వైసీపీలో ఉన్న బలహీనవర్గాల నాయకులు ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రశ్నించాలని, లేకుంటే బానిసల్లా మిగిలిపోతారన్నారు. 


Updated Date - 2020-11-28T06:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising