‘ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి
ABN, First Publish Date - 2020-10-01T07:11:04+05:30
18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు అవగాహన కల్పించాలని తహశీల్ధార్ రజనీకుమారి,
ఏలేశ్వరం, సెప్టెంబరు 30: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా అధికారులు అవగాహన కల్పించాలని తహశీల్ధార్ రజనీకుమారి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్ధార్ శ్రీనివాస్ ఆదేశించారు.
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై బుధవారం అవ గాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్ఐ పొన్నాలు, అవసరాల కిషోర్, రొంగల శ్రీనివాసరావు, కొట్టేటి సత్యారావు, మోహనరావుదొర, వెంకటరెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T07:11:04+05:30 IST