ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలను తెరిస్తే జాగ్రత్తలు పాటించాలి

ABN, First Publish Date - 2020-06-05T11:13:58+05:30

ఈ నెల 8 నుంచి దేవాలయాలను తెరిస్తే పలు జాగ్రత్తలు పాటించి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులను అనుమతించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవదాయశాఖ సహాయ కమిషనరు ప్రసాద్‌ 


గోదావరి సిటీ, జూన్‌ 4: ఈ నెల 8 నుంచి దేవాలయాలను తెరిస్తే పలు జాగ్రత్తలు పాటించి కట్టుదిట్టమైన  ఏర్పాట్లతో భక్తులను అనుమతించాలని దేవదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనరు కేఎన్వీడీవీ ప్రసాద్‌ కోరారు. గురువారం ఉదయం ఆయన ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి అర్చకులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయాలను తెరిచే విషయంలో కేంద్రం సూచనలే తప్ప పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు లేవన్నారు.


ఒకవేళ అనుమతి వచ్చినా ఆరు అడుగుల దూరం పాటిస్తూ భక్తులకు దివ్యదర్శనం మాత్రమే ఉంటుందన్నారు. ప్రదక్షిణ, శఠగోపం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు, అంతరాలయ దర్శనం వంటి సేవలేమీ ఉండవన్నారు. మాస్కులను దర్శించి చేతులను శానిటైజ్‌ చేసుకున్న అనంతరమే భక్తులకు ఆలయ ద్వారం వద్ద ప్రవేశముంటుందన్నారు. అనంతరం ఆయన సోమాలమ్మ గుడి, వేణుగోపాలస్వామి, ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - 2020-06-05T11:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising