ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-06T05:37:33+05:30

వార్డు సచివాలయలకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సిబ్బందికి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 5: వార్డు సచివాలయలకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సిబ్బందికి సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ పరిధిలోని 45, 46, 47 సచివాలయాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అవి పరిష్కారం కాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో జరుగుతున్న పీఎం స్వానిధిపై చర్చించారు. ప్రతీ ఒక్క లబ్దిదారుడికి పథకాలను అందజేయాల్సిన బాధ్యత కార్యదర్శులు, వలంటీర్లపై ఉందని, ఈ విషయంలో అలసత్వం వహించొద్దని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఆయన  వెంట కార్పొరేషన్‌ సెక్రటరీ ఆర్‌.కాళీబాబు తదితరులున్నారు.

Updated Date - 2020-12-06T05:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising