ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరికథా, వేద పాఠశాలల వార్షికోత్సవం

ABN, First Publish Date - 2020-09-24T07:53:00+05:30

కపిలేశ్వరపురంలో శ్రీసర్వారాయ హరికథా, వేద పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలల 48వ వార్షికోత్సవం ఘనంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కపిలేశ్వరపురం, సెప్టెంబరు 23: కపిలేశ్వరపురంలో శ్రీసర్వారాయ హరికథా, వేద పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలల 48వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హరికథా పాఠశాలలో వేద పాఠశాల ప్రిన్సిపాల్‌ తంగిరాల వెంకటవిశ్వనాథ సోమయాజి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉభయ పాఠశాలల వ్యవస్థాపకులు,  కేంద్ర మాజీమంత్రి దివంగత ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు (చంటిదొర) శతజయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు చంటిదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు గొర్తి రామచంద్రరావు, వెంకటరావు, ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి, ఎన్‌.అబ్బిరాజు, దత్తు, చలపతిరావు మాట్లాడుతూ చంటిదొర సేవలను కొనియాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేదపఠనం నిర్వహించారు. మేకా కృష్ణ, ఉమాచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T07:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising