హరికథా, వేద పాఠశాలల వార్షికోత్సవం
ABN, First Publish Date - 2020-09-24T07:53:00+05:30
కపిలేశ్వరపురంలో శ్రీసర్వారాయ హరికథా, వేద పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలల 48వ వార్షికోత్సవం ఘనంగా
కపిలేశ్వరపురం, సెప్టెంబరు 23: కపిలేశ్వరపురంలో శ్రీసర్వారాయ హరికథా, వేద పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలల 48వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హరికథా పాఠశాలలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ తంగిరాల వెంకటవిశ్వనాథ సోమయాజి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉభయ పాఠశాలల వ్యవస్థాపకులు, కేంద్ర మాజీమంత్రి దివంగత ఎస్బీపీబీకే సత్యనారాయణరావు (చంటిదొర) శతజయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు చంటిదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు గొర్తి రామచంద్రరావు, వెంకటరావు, ఎన్ఎస్ఆర్ మూర్తి, ఎన్.అబ్బిరాజు, దత్తు, చలపతిరావు మాట్లాడుతూ చంటిదొర సేవలను కొనియాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేదపఠనం నిర్వహించారు. మేకా కృష్ణ, ఉమాచౌదరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-24T07:53:00+05:30 IST