108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2020-07-08T10:29:04+05:30
108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు.
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
సామర్లకోట, జూలై 7: 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నూతనంగా 108 అంబులెన్స్ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో సమీక్షించారు. ఆవరణలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించే నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర, 108 సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-07-08T10:29:04+05:30 IST