హైకోర్టుకు 29 వరకు దసరా సెలవులు
ABN, First Publish Date - 2020-10-24T08:55:37+05:30
హైకోర్టుకు శుక్రవారం నుంచి 29 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 30వ
హైకోర్టుకు శుక్రవారం నుంచి 29 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 30వ తేదీన ఈద్-మిలాదున్నబి కారణంగా ఆరోజు సెలవు. హైకోర్టు తిరిగి నవంబరు 2 నుంచి పని చేయనుంది.
కాగా అత్యవసర కేసుల్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.రజనీ, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం 28న విచారించనుంది. ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగా కేసుల్ని విచారించనున్నారు. అదే రోజు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి అత్యవసర కేసులపై విచారణ చేపట్టనున్నారు.
Updated Date - 2020-10-24T08:55:37+05:30 IST