అడ్మిషన్లు చేపట్టొద్దు: ఇంటర్బోర్డు కార్యదర్శి
ABN, First Publish Date - 2020-03-29T08:53:22+05:30
ఇంటర్ అడ్మిషన్లు నేరుగా చేపట్టవద్దని.. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇ-అడ్మిషన్ల విధానం అమల్లో రానుందని ఇంటర్...
అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ అడ్మిషన్లు నేరుగా చేపట్టవద్దని.. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇ-అడ్మిషన్ల విధానం అమల్లో రానుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు స్పష్టంచేశారు. ఇంటర్ బోర్డుకు అనుబంధంగా ఉన్న పలు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తూ విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజు కూడా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
Updated Date - 2020-03-29T08:53:22+05:30 IST