ఏపీ మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్.. ఆందోళనలో శ్రేణులు
ABN, First Publish Date - 2020-07-10T17:13:50+05:30
మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం: మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటినుంచి మంత్రి కృష్ణదాసు హోం క్వారంటైన్కు వెళ్లిపోయారు. బుధవారం ఆముదాలవలసలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని కూడా హోం క్వారంటైన్కు వెళ్లారు. 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలకు రావద్దంటూ ఇప్పటికే మంత్రి, స్పీకర్ కార్యకర్తలకు సూచించారు. మంత్రి కుమారుడికి పాజిటివ్ రావడంతో ఆయనతో తిరిగిన కార్యకర్తలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
Updated Date - 2020-07-10T17:13:50+05:30 IST