ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-10-26T23:36:42+05:30

మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 71.02 శాతం పూర్తయ్యాయని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకుందన్నారు. పోలవరం ఉనికి ప్రమాదంలో పడితే సీఎం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘పోలవరం అంచనాలపై వైసీపీ తప్పుడు ప్రచారంతోనే నష్టం. 2017-18 రేట్ల ప్రకారం పోలవరం అంచనాలు రూ.57,297 కోట్లు. డీపీఆర్‌-1 కు.. డీపీఆర్‌-2కు ముంపు పెరిగింది..పరిహారం పెరిగింది. కేంద్రం ప్రశ్నలకు సమాధానం చెబితే రూ.55,548 కోట్లకు ఆమోదం తెలిపారు. రూ.55,548 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని...2019 జూన్ 24న పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారు. పోలవరంలో ఇరిగేషన్‌తో పాటు పునరావాసం ఖర్చు కూడా భరిస్తామని గతంలో కేంద్రం ఒప్పుకుంది. గడ్కరీ ప్రాజెక్ట్ వద్దకు వచ్చినప్పుడు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు’’ అని వివరించారు.

Updated Date - 2020-10-26T23:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising