ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుంది: సత్యకుమార్
ABN, First Publish Date - 2020-05-28T21:27:05+05:30
ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుందని, జగన్ ఏడాది పాలనలో హైకోర్టు 60 సార్లు మొట్టికాయలు వేసిందని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో
విజయవాడ: ఏపీలో అభివృద్ధి తిరోగమనంలోకి పోతుందని, జగన్ ఏడాది పాలనలో హైకోర్టు 60 సార్లు మొట్టికాయలు వేసిందని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్లను బీజేపీ నేతలు మధుకర్, సత్యకుమార్, తురగా నాగభూషణం అందజేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ పార్టీ రంగులు, ఇంగ్లీషు మీడియం వంటి అంశాలలో ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు. దేవాదాయ ఆస్తులను అమ్మే యోచనను పూర్తిగా విరమించు కోవాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.
Updated Date - 2020-05-28T21:27:05+05:30 IST