ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు శ్రీవారిపై ఆపారమైన భక్తి విశ్వాసం ఉంది: డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2020-09-22T12:59:59+05:30

శ్రీవారిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సీయం జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సీయం జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు ప్రజలపై విశ్వాసం ఉందని...ప్రజలే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. ఆయనకు కులం, మతం పట్టింపులు లేవని చెప్పారు. మంత్రి కొడాలి నాని వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.  డిక్లరేషన్ అంశం ఇప్పుడు అనవసరమని.. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అనేక సార్లు శ్రీవారి దర్శనం కోసం విచ్చేశారని చెప్పుకొచ్చారు. శ్రీవారి భక్తుడు కాబట్టే జగన్ కాలినడకన తిరుమల విచ్చేశారన్నారు. దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తూన్నాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. 

Updated Date - 2020-09-22T12:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising