ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో కర్ఫ్యూ వాతావరణం

ABN, First Publish Date - 2020-09-23T20:46:21+05:30

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన తిరుమల బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన తిరుమల బయలుదేరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నగరమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.


తిరుపతిలో బీజేపీ, తెలుగుదేశం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటారన్న ప్రచారంతో పోలీసులు విపక్ష నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడే మోహరించారు. టీటీడీ పరిపాలన భవనం ముందు టీడీపీ నిరసనకు పిలుపు ఇవ్వడంతో చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ ముఖ్య నేతలు తిరుపతికి రావాలని నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-23T20:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising